हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Tejaswini Y
Telugu News: Coimbatore Crime: దూమారం రేపుతున్న డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో(Coimbatore Crime) ఇటీవల ఒక కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన డీఎంకే కూటమి మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్(MLA Easwaran) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి దారితీశాయి. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ దారుణం నేపథ్యంలో, ఆయన మాట్లాడుతూ — “రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విద్యార్థిని తన స్నేహితుడితో కారులో కూర్చోవడం అవసరమా?” అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలు బాధితురాలిని పరోక్షంగా నిందించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలపై నేరాలకన్నా వారి ప్రవర్తనను ప్రశ్నించడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) ఈశ్వరన్ వ్యాఖ్యలను ఘాటుగా విమర్శించింది.
బీజేపీ నేత కె. అన్నామలై సహా పలువురు నాయకులు స్పందిస్తూ, “బాధితురాలిని నిందించడం అమానుషం. మహిళల భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని పేర్కొన్నారు.
బాధితురాలిపై సానుభూతి చూపకుండా ఆమెపై తప్పు మోపడం సామాజిక బాధ్యతా రాహిత్యం అని వ్యాఖ్యానించారు.

Read Also: Pune: కూతుర్ల మీద ప్రేమ .. కట్ చేస్తే రూ. 14 కోట్లు పోగొట్టుకున్న తండ్రి

ఈ కేసులో పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాలీశ్వరన్లను అరెస్ట్ చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంస్థలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి.
ప్రజలు మహిళల భద్రతను నిర్ధారించేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “ఇలాంటి నేరాలకు పాల్పడినవారికి గరిష్ట శిక్ష తప్పదని, పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని” ఆయన ఆదేశించారు. అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతుండగా, ప్రజలు బాధితురాలికి న్యాయం కావాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870