టివీ5 మూర్తి అంటే తెలియని వారుండరు. నిత్యం తన వార్తలతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే(Crime) ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఫోన్ ను టివీ5 మూర్తి ట్యాప్ చేసి, రూ.10కోట్లు డిమాండు చేస్తున్నాడు. దీంతో ధర్మసత్యసాయి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు టీవీ5 మూర్తిపై కేసు నమోదు చేశారు.
Read also: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా

కోర్టును ఆశ్రయించిన నటుడు
హైదరాబాద్(Hyderabad) టీవీ5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ, రూ.10 కోట్లు డిమాండ్(Crime) చేస్తున్నారు. దీంతో ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్ కోర్టును ఆశ్రయించారు. తన ఫోన్ ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేసి, రూ.10 కోట్లు ఇవ్వాలని మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ఎ1గా గౌతమి చౌదరి, ఎ2గా మూర్తిని చేరుస్తూ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు కూకట్ పల్లి పోలీసులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: