Crime: ఆధునిక టెక్నాలజీ యుగంలో జీవిస్తున్న మనం ఇంకా కులం, మతం అంటూ జీవిస్తున్నాం. ఒకవైపు గ్లోబలేజేషన్ తో మన పిల్లలు చదువు, ఉద్యోగం పేరుతో విదేశాల్లో స్థిరపడుతున్నారు. అక్కడి వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ జీవిస్తున్న మనం మాత్రం ఇంకా కులం, మతం అంటూ హద్దులు పెట్టుకుంటున్నాం. అందుకే తమ పిల్లల్ని మనం క్షమించలేని స్థితిలో నేరాలకు పాల్పడుతున్నారు. తమ కూతురు లవ్, మ్యారేజ్ చేసుకుందని ఓ తండ్రి ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబ సభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. సంగారెడ్డి (sangareddy) జిల్లా ఎస్ ఐ పాటిల్ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్, కూతురు అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ ను ప్రేమించింది.
Read also: Telugu News: Drugs: ఛీ..ఛీ..నువ్వేం వైద్యుడివి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావ్?

Crime: కూతురి ప్రేమవివాహం.. ప్రేమికుడి ఇంటికి నిప్పు
Crime: దీంతో ఆమె నగేష్ ను పెళ్లి చేసుకోవాలని భావించింది. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి, అతడినే పెళ్లాడతానని చెప్పింది. దీనికి విఠల్ అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పెళ్లి చేసుకున్న కూతురు ఈ నేపథ్యంలో యువతి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. తన కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆమె తండ్రి గొల్ల విఠల్ కు తెలియడంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి నగేష్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో ఆగక యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనపై నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తండ్రీకొడుకులపై కేసు పెట్టారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: