విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళం
విజయవాడలోని(Jogi Ramesh) ప్రభుత్వ ఆసుపత్రిలో వైకాపా నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు, అనుచరులు సృష్టించిన గందరగోళం కేసుగా మారింది. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడడంతో పాటు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు అద్దాలను పగలగొట్టిన ఘటనలో జోగి రమేశ్ భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్ తదితరులను నిందితులుగా చేర్చారు.
నకిలీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్, రాములను కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల కోసం పోలీసులు విజయవాడ(Vijayawada) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రమేశ్ కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొని, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగి, వార్డు ప్రవేశద్వారం వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. జై జోగి అంటూ నినాదాలు చేస్తూ వారు ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళం సృష్టించారు.
Read also: వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

ఎస్సైపై బెదిరింపులు నిందితులపై కేసులు నమోదు
డ్యూటీలో ఉన్న ఎస్సై శంకర్ రావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తీవ్రంగా బెదిరించినట్లు((Jogi Ramesh)) సమాచారం. ఇంకో రెండేళ్లే ఈ ప్రభుత్వం. నీ పేరు డిజిటల్ బుక్లో రాస్తాం. నీ కాలర్ పట్టుకుని చూపిస్తాం అంటూ హెచ్చరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ తికమకలో ఒక కానిస్టేబుల్ కిందపడిపోగా, అతడిని తొక్కుకుంటూ కొందరు ముందుకు దూసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనలో శకుంతల, రాజీవ్, రోహిత్లను వరుసగా ఏ1, ఏ2, ఏ3 నిందితులుగా నమోదు చేశారు. అదనంగా, వీడియో ఫుటేజీ ఆధారంగా మరో 10–15 మందిని నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: