తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నారా రోహిత్ (Nara Rohith) తన భార్య శిరీషతో కలిసి శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నారు.. వీరి వివాహం ఇటీవలే అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
Read Also: South Central Railway: ఒక్క నెలలో రూ.25.22 కోట్ల ఫైన్ వసూలు
ఆదివారం వీఐపీ (VIP) ప్రారంభ విరామ దర్శన సమయానికి నారా రోహిత్, శిరీష (Nara Rohith) దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో నారా రోహిత్ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: