తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. “పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్లో గెలిపిస్తే కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట” అనే రేవంత్ వ్యాఖ్య దేశ సైనికుల ధైర్యసాహసాలను అవమానపరచేలా ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లను కించపరిచే వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి తగదని ఆయన వ్యాఖ్యానించారు.
News Telugu: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు
బండి సంజయ్ మాట్లాడుతూ, “పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల త్యాగం, ధైర్యం దేశ ప్రజలకు గర్వకారణం. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ సాహసాలను అవమానించేలా ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ తప్పు కాదు, దేశ గౌరవానికే దెబ్బ” అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను పెంచాయని గుర్తు చేశారు. “సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకూ తలవంచే విషయం” అని బండి సంజయ్ మండిపడ్డారు.

“సైనికుల గౌరవం దేశ గౌరవం. ఆ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భద్రత వంటి అంశాలను తేలికగా తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ వ్యాఖ్యల అసలు ఉద్దేశాన్ని గుర్తించి రేవంత్కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. “సైన్యం చేసిన త్యాగాలపై ఎవరైనా అపహాస్యం చేస్తే, దేశ ప్రజలే సమాధానం చెబుతారు” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/