ఖరీదైన ఫోన్ బదులు టైల్ ముక్క – బెంగళూరు టెకీకి షాక్

బెంగళూరులో జరిగిన ఓ డెలివరీ మోసం(Delivery Fraud) ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. యలచెనహళ్లి ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ.1.86 లక్షలు వెచ్చించి ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ ఆర్డర్ చేశాడు. అయితే డెలివరీ బాక్స్ను తెరిచి చూసినప్పుడు, ఫోన్ స్థానంలో తెల్లటి టైల్ ముక్క మాత్రమే కనిపించడంతో షాక్ అయ్యాడు.
43 ఏళ్ల టెకీ అమెజాన్ ద్వారా శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7(Samsung Galaxy Z Fold 7) మోడల్ను అక్టోబర్ 14న రూ.1,86,000 చెల్లించి ప్రీ-పెయిడ్ ఆర్డర్గా బుక్ చేశాడు. అక్టోబర్ 19న పార్సిల్ అందుకున్న సమయంలో, ఏదైనా మోసం జరగవచ్చనే అనుమానంతో మొత్తం అన్బాక్సింగ్ ప్రక్రియను వీడియోగా రికార్డ్ చేశాడు. అయితే ఫోన్ స్థానంలో టైల్ ముక్క మాత్రమే కనిపించడం అతనికి పెద్ద షాక్గా మారింది.
Read also: ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి నియామకం

ఫిర్యాదు నమోదు దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు
డెలివరీ ఎగ్జిక్యూటివ్ను సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన రాకపోవడంతో, బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్(Delivery Fraud) రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేశాడు. అనంతరం కుమార్ స్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసాడు. పోలీసులు ఐటీ చట్టం కింద మరియు భారతీయ దండన చట్టంలోని సెక్షన్ 318(4), 319 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా మోసం ఎక్కడ జరిగిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. డెలివరీ సంస్థ, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, అలాగే పార్సిల్ను హ్యాండిల్ చేసిన సిబ్బంది పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. సైబర్ నిపుణులు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఖరీదైన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయాలని, అలాగే అనుమానాస్పద ఘటనలు తక్షణమే సైబర్ క్రైమ్ పోర్టల్లో నివేదించాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: