తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పాఠశాలల మౌలిక వసతులను ఆధునికీకరించేందుకు సర్కారు సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా వస్తే, దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!
ఈ ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాలు, లైబ్రరీలు, క్రీడా మైదానాలు, సైన్స్ ల్యాబ్లు వంటి వసతులు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు టెక్నాలజీ ఆధారిత విద్యను అలవర్చుకునేలా స్మార్ట్ క్లాస్రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా టీచర్లు మరియు విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ID కార్డులు జారీ చేయనున్నారు. వీటితో హాజరు, విద్యా ప్రగతి, బదిలీలు, ఇతర పరిపాలనా వివరాలు డిజిటల్ రూపంలో రికార్డు చేయడం సులభమవుతుంది.

ఇక 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందించనున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు అవసరమైన ప్రాథమిక అవగాహన, శిక్షణ లభిస్తుంది. పేద విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే, తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో కొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/