టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన సరదా హాస్యంతో మరోసారి అభిమానులను అలరించాడు. మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Pietersen) తనతో మైదానంలో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, దీనిపై ఆయన భార్య జెస్సికాకు సరదాగా ఫిర్యాదు చేశానని రాహుల్ వెల్లడించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో రాహుల్ కెప్టెన్గా, పీటర్సన్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య మైదానంలోనూ, బయటా సరదా సంభాషణలు తరచుగా జరుగుతుంటాయి.
Read Also: Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో పాక్ స్థానంలో పాల్గొననున్న ఒమన్
ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్లో కే.ఎల్. రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ, పీటర్సన్, తన మధ్య జరిగే ఆసక్తికర సంభాషణల గురించి పంచుకున్నాడు. తమ మధ్య ఎన్నో ఆసక్తికర వాదనలు జరుగుతుంటాయని, తమ కొన్ని సంభాషణలను ఢిల్లీ జట్టు సామాజిక మాధ్యమ బృందం రెండు, మూడుసార్లు ఇన్స్టాగ్రాంలో పోస్టు చేసిందని గుర్తు చేసుకున్నాడు.వాటిని తన భార్య అతియా శెట్టి చూసి, కెవిన్ పీటర్సన్ చాలా మంచి వ్యక్తి అని,

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనలో
అతనితో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడిగిందని చెప్పాడు. వాస్తవానికి తాను, పీటర్సన్ మాట్లాడుకునే చాలా సంభాషణలు అన్నీ బయటకు రావని చెప్పాడు. బయటకు వచ్చేవి కొన్ని మాత్రమేనని అన్నాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనలో పీటర్సన్, అతని భార్య జెస్సికాతో ఒక విందులో పాల్గొన్నానని,
ఆ సమయంలో పీటర్సన్పై సరదాగా ఫిర్యాదు చేశానని చెప్పాడు. “నేను యూకేలో ఉన్నప్పుడు పీటర్సన్పై అతడి భార్యకు ఫిర్యాదు చేశాను. వారు నన్ను విందుకు ఆహ్వానించిన సమయంలో, ‘నాతో కాస్త సౌమ్యంగా ఉండమని మీ భర్తకు చెప్పండి. నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేశాను” అని చెప్పాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: