గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది యువత పెడత్రోవ పడుతున్నారు. ప్రత్యేకంగా సెల్ ఫోన్లు చేతిలోకి రావడంతో వారి అందమైన బాల్యం చేదుజ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. ముక్కుమొహం తెలియని వారితో పరిచయం, ప్రేమ అంటూ మోసపోతున్నారు. కెరీర్ ను తీర్చిదిద్దుకోవాల్సిన సమయంలో ప్రేమ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఓ మైనర్ బాలిక, బాలుడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..
Read Also: AP: ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

బాలుడిపై పోక్సో కేసు
గుంటూరు జిల్లా పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కోబాల్ట్ పేటకు చెందిన బాలిక (17), ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అదే ప్రాంతానికి చెందిన బాలుడు(17) మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాటింగ్ చేస్తూ, చివరికి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరు పలుమార్లు శారీరకంగా కలుసుకున్నారు. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో నెత్తినోరు కొట్టుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు.
పిల్లలు సెల్ ఫోన్ లలో(cell phone) ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అంతేకాక వారు స్కూలు, కళాశాలకు వెళ్తున్నప్పుడు వారిపై ఒక నిఘాకన్ను ఉంచాలి. వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారో కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఊహించని అనర్థాలు జరుగుతాయి. అప్పుడు ఎంత బాధపడ్డా లాభం ఉండదు. పోలీసులు కూడా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: