వచ్చే నెల భారత్ జట్టుతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ (Test series) కు సౌతాఫ్రికా తమ 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించింది. ఈ టూర్పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సబ్కాంటినెంట్ పిచ్లపై సౌతాఫ్రికా (South Africa) ఆట ఎలా ఉండబోతుందన్నది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఈ సిరీస్కి కెప్టెన్గా టెంబా బవుమా (Temba Bavuma) బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Also: ICC T20 Rankings 2025:భారత్-ఆస్ట్రేలియా టీ20 ర్యాంకింగ్స్ పోరు

ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లు మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్లా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: