చిరంజీవి డీప్ఫేక్ వీడియోలపై ఫిర్యాదు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫొటోలు మరియు వాయిస్ నుమార్ఫ్ చేసి AI(AI deep fake) సాయంతో రూపొందించిన అశ్లీల డీప్ఫేక్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం (Chiranjeevi) వ్యక్తం చేశారు. ఈ వీడియోలు ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని గుర్తించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ మధ్య కాలంలో AI టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరిగింది. కానీ, దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన్నా, రజినీ కాంత్ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి డీప్ఫేక్ సమస్యల బారిన పడ్డారు.
మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

కోర్టు ఆదేశాలు మరియు సైబర్ క్రైమ్ చర్యలు
చిరంజీవి తన ఫిర్యాదు ప్రకారం, అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, ఫొటో, మెగాస్టార్, చిరు వంటి గుర్తింపులను వాడకూడదని కోర్టులో(Chiranjeevi)పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పిటిషన్ను విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా డీప్ఫేక్, వాయిస్ క్లోనింగ్ లేదా ఇతర AI దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశాలు పొందారు. ఈ చర్యల ప్రకారం, పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: