బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ప్రేక్షకులను ఊహించని ట్విస్టులతో ఆకట్టుకుంటూనే ఉంది. ఈసారి హౌస్లో వాతావరణం మరింత వేడెక్కిపోయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి.ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఎంటర్టైన్మెంట్ మరింత పెరిగింది. అయితే అదే సమయంలో హౌస్లో వాదనలు, గొడవలు కూడా ఎక్కువయ్యాయి.
Read Also: Bigg Boss 9: బిగ్బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదల
అయినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం ఈ సీజన్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్లో విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ మరోసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతని గేమ్ గ్రాఫ్ మరింత ఎత్తుకు చేరిందని చెప్పాలి. హౌస్లో ఇప్పుడు అతనిపై అంచనాలు పెరిగాయి.
ఈ వారం మధ్యలో అయేషా (Ayesha) ఆరోగ్య సమస్యల కారణంగా హౌస్ను విడిచి వెళ్లింది. ఆమెకు టైఫాయిడ్ రావడంతో బిగ్ బాస్ వైద్యుల సలహా మేరకు ఇంటికి పంపించారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ప్రేక్షకులు భావించారు.

షూట్ కూడా ఇప్పటికే పూర్తయిందని
అయితే, బిగ్ బాస్ (Bigg Boss 9) అనూహ్యంగా మరో షాక్ ఇచ్చాడు. వీకెండ్ ఎపిసోడ్లో రెండో ఎలిమినేషన్ కూడా జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈసారి రమ్య మోక్ష హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. షూట్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. గత వారం రమ్య వెళ్లిపోతుందనే ఊహాగానాలు వచ్చినా, చివరికి భరణి శంకర్ అవుట్ అయ్యాడు.
బిగ్ బాస్ హౌస్లో రెండు వారాలు మాత్రమే ఉన్న రమ్య మోక్ష (Ramya Moksha) కు సుమారు రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన నేపథ్యంలో, ఎవరైనా రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ మొదలైంది. మొత్తానికి, ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో గేమ్ మరింత వైలెంట్గా, డ్రామాటిక్గా మారబోతోందని టాక్ వినిపిస్తోంది. అభిమానులు ఇప్పుడు దమ్ము శ్రీజ రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: