ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ (Andhra Pradesh Education Department) 2025–26 అకాడమిక్ సంవత్సరం కోసం టెన్త్ (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలపై ప్రణాళిక రూపొందిస్తూ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో పరీక్షలు నిర్వహించే విధంగా బోర్డు ఇప్పటికే ఒక ప్రతిపాదన రూపొందించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, మార్చి 16 నుంచి ఆరంభించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదించింది.
Nujividu Crime: మంట గలిసిన మానవత్వం .. మృతదేహ స్మశానంలో ఓ మహిళ
ఇక ఇంటర్మీడియట్ (12th) పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతుండగా, ముఖ్య సబ్జెక్టులైన కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి పేపర్లు మార్చి 17వ తేదీ వరకు ఉన్నందున, టెన్త్ పరీక్షలను ఏ తేదీ నుంచి ప్రారంభించాలో కచ్చితంగా నిర్ణయించాల్సి ఉంది. ఈ కారణంగా విద్యాశాఖ ఇప్పటికే సమన్వయ ప్రయత్నాలు ప్రారంభించింది..

టెన్త్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ షెడ్యూల్తో సమన్వయం చేయడం అత్యంత అవసరం. అలాగే, పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి, మాక్ టెస్టులు, ప్రాక్టీసు సెషన్లు వంటి ముందస్తు కార్యక్రమాలను కూడా నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు తాము చదివిన పాఠ్యాంశాలను సమగ్రంగా సులభంగా సమీక్షించుకోవడానికి ఈ సమయ సమన్వయం కీలకంగా ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: