Pawan Kalyan: పంచాయతీ పాలనలో పలు సంస్కరణలు: డిసిఎం పవన్ విజయవాడ (vijayawada) : రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు అంచెల వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చే దిశలో ఉండాలన్నారు. నవంబరు 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డిడిఒ) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతా ధికారులతో ఉపముఖ్యమంత్రి సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దుచేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని డి.సిఎం చెప్పారు.
Read also: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

Pawan Kalyan: నవంబరు 1 నుంచి డిడిఒ కార్యాలయాలు
పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోను, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు. గ్రామీణ ముఖ చిత్రం మారే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతిపాదిత అంశాలు అమలు కావాలన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ చీప్ విప్ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే డిడిఒ కార్యాలయాల ఉద్దేశ్యం ఏమిటి?
గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం, పంచాయతీరాజ్ వ్యవస్థలో సేవల అందుబాటును పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా డిడిఒ కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణలు ఏమిటి?
క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం, నాలుగు అంచెల వ్యవస్థను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: