हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Kavitha: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సిజెఐకి కవిత లేఖ

Vanipushpa
Latest Telugu News: Kavitha: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సిజెఐకి కవిత లేఖ

తెలంగాణలో ఇటీవలే నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న గ్రూప్-1 పరీక్షపై తీవ్ర దుమారం రేగింది. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనంగా మారింది. గ్రూప్-1 నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, రాష్ట్రపతి ఉత్తర్వులను సైతం ఉల్లంఘించారని ఆమె తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కవిత తన లేఖ ద్వారా సీజేఐని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో కవిత ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

sp
sp

తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం

గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు కవిత వెల్లడించారు. ప్రశ్నాపత్రాల అనువాదంలో (ట్రాన్స్‌లేషన్) లోపాల వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, దీంతో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా, ప్రిలిమ్స్ పరీక్షకు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ పరీక్షకు మరో హాల్ టికెట్ నంబర్ కేటాయించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870