Amrut 2.0: సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం విజయవాడ (vijayawada) : పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ది, ఇతరత్రా 281 ప్రాజెక్టుల పనులు అమృత్ 2.0 లో చేపట్టేందుకు రూ.10,319 కోట్లతో సవరించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. కన్సెషనల్ హఃబ్రిడ్ యాన్యుటీ మోడల్ (చామ్)లో పనులు పూర్తి చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగా కేటాయించని కారణంగా నిలిచిపోయిన అమృత్ 2.0 పనులు ఇప్పుడు ఛామ్ మోడల్లో పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంచనా వ్యయంలో 60% మొత్తాన్ని గుత్తేదారు సంస్థలు సమకూర్చనున్నాయి. వీటిని వడ్డీతో పదేళ్లలో 40 వాయిదాల కింద రాష్ట్రప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. మిగతా 40% నిధులు పట్టణ స్థానిక సంస్థల వాటాతో పాటు 15,16వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్నారు. ప్రతి బిల్లులో నుంచి 7.5% మొత్తాలు తగ్గించి గుత్తేదారులకు చెల్లించేవిధానానికి చామ్ మోడల్లో మినహాయించారు.
Read also: Bangladesh: బంగ్లా నేవీ చేత మత్స్యకారుల అరెస్ట్

Amrut 2.0: అమృత్ 2.0 పనులకు ప్రభుత్వం ఆమోదం
Amrut 2.0: ఈ మొత్తాలు పనులు పూర్తయ్యాక తిరిగి గుత్తేదారులకు చెల్లిస్తుంటారు. జాతీయ రహదారుల అథారిటీ పనుల్లో ఇలాంటి మినహాయింపు ఇచ్చినందున… అదే మోడల్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో 60% మొత్తాలు గుత్తేదారులే పెట్టుబడిగా పెడుతున్నందున బిల్లుల్లో ప్రతిసారీ 7.5% కోత పెట్టాలన్న నిర్ణయం పైనా గుత్తేదారు సంస్థలు అభ్యంతరం తెలిపాయి. 2025-26 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏపీ పట్టణాభివృద్ధి చరిత్రలో అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్టుగా రికార్డ్, పట్టణాల్లో మెరుగైన త్రాగునీరు, డ్రైనేజీ సుపాయంరూ.10,319.93 కోట్లతో 281 పనులకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మున్సిపల్ శాఖ ఆమోదం ఎపియుఎఫ్ ఐడిసి, పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్లకు భాధ్యతలుమొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో కేంద్రం నుంచి రూ.4,470 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,490 కోట్లు, ఫైనాన్స్ కమీషనర్ నిధులు రూ.925 కోట్లు, పట్టణాల వాటా రూ.590 కోట్లుమొత్తం ప్రాజెక్ట కాంప్లెక్స్ రూ.6,477 కోట్లు, పదేళ్ళ నిర్వహణ ఖర్చు రూ.1499 కోట్లు, వడ్డీ ఖర్చు రూ.2,344 కోట్లు కేటాయించారు.
అమృత్ 2.0లో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు చేపట్టనున్నారు?
అమృత్ 2.0 కింద తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి తదితరంగా మొత్తం 281 ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదించిన మొత్తం ఎంత?
ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 10,319 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: