हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News – Delhi Air Pollution: డేంజర్ జోన్లోకి ఢిల్లీ ‘గాలి’..!!

Sudheer
Breaking News – Delhi Air Pollution: డేంజర్ జోన్లోకి ఢిల్లీ ‘గాలి’..!!

దీపావళి వేడుకల తర్వాత ఢిల్లీ మరోసారి పొగమంచు ముసుగులో కూరుకుపోయింది. పటాకుల పొగ, వాహనాల ఉద్గారాలు, వాతావరణ మార్పులు కలిసి రాజధానిని శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమైన వాతావరణంగా మార్చేశాయి. ఇవాళ ఉదయం చాణక్య ప్లేస్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 979గా, నారాయణ విలేజ్‌లో 940గా నమోదైంది. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ధేశించిన పరిమితిని దాటిపోయి “అత్యంత ప్రమాదకర స్థాయి”గా పరిగణించబడుతున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో కంటి మంట, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి.

Telugu News: Delhi Pollution:బీజేపీ-ఆప్ మధ్య వాతావరణ ఉద్రిక్తత

వైద్య నిపుణులు పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా పేర్కొంటున్నారు. AQI 400 దాటితేనే అది ప్రమాదకరమని చెప్పగా, ఇప్పుడు దాదాపు వెయ్యి వద్దకు చేరడంతో ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఆస్థమా మరియు హృద్రోగులు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారు ఎమర్జెన్సీ తప్ప బయటకు రావొద్దని, తప్పనిసరిగా N95 లేదా N99 మాస్కులు ధరించాలని సూచించారు. ఇంట్లో గాలి శుద్ధి పరికరాలు (air purifiers) ఉపయోగించడం, నీటిని ఎక్కువగా తాగడం, పొగ వాతావరణంలో వ్యాయామం చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఇక ప్రభుత్వ స్థాయిలో కూడా అత్యవసర చర్యలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు మూసివేయడం, కట్టడాల పనులు నిలిపివేయడం, వాహన రాకపోకలను పరిమితం చేయడం వంటి చర్యలు పరిగణనలో ఉన్నాయి. అయితే పటాకుల నిషేధం ఉన్నప్పటికీ, దీపావళి రాత్రి భారీగా వాటిని కాల్చడం వల్ల ఈ పరిస్థితి మరింత విషమించిందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రతి ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీ గాలి ఇలాగే విషపూరితమవుతుందని గుర్తుచేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారం కోసం కఠిన చట్టాలు, పౌర అవగాహన రెండూ అవసరమని పర్యావరణ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870