ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త – రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
Indiramma Illu : న్యూఢిల్లీ, అక్టోబర్ 17 తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద శుభవార్త చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం పేదలకు గృహ నిర్మాణంలో తోడ్పడటమే (Indiramma illu) ఇందిరమ్మ ఇళ్లు కాకుండా గ్రామీణ నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించనుంది.
ఇందిరమ్మ ఇళ్ల
ఇందిరమ్మ ఇళ్లు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం, ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ని అనుసంధానం చేసింది. దీనికి సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Read Also : Summit : హైదరాబాద్లో స్టార్టప్ సమ్మిట్
సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పేదలకు గృహ (ఇందిరమ్మ ఇళ్లు) నిర్మాణానికి ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు కనీసం 90 రోజుల పనిదినాలు కల్పించనున్నారు.
ప్రస్తుతం మంజూరు చేసిన మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు, సుమారు 2.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma illu) నిర్మాణంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకు
బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజుల పని, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పని అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం లభిస్తోంది. ఈ లెక్కన 90 రోజుల పాటు పని చేస్తే ఒక్కో కూలీకి రూ.27,630 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇలా లబ్ధిదారులు తమ ఇల్లు (ఇందిరమ్మ ఇళ్లు) నిర్మించుకుంటూనే వేతనం పొందే అవకాశం కల్పించబడింది.
పారిశుద్ధ్య పనులకు రూ.12,000 అదనంగా అందించనున్నారు.
అంతేకాకుండా, స్వచ్ఛ భారత్ మిషన్ (SBM)లో భాగంగా టాయిలెట్స్ నిర్మాణం మరియు పారిశుద్ధ్య పనులకు రూ.12,000 అదనంగా అందించనున్నారు. ఇక పీఎం ఆవాస్ యోజన (PMAY) కింద ఒక్కో ఇంటికి రూ.72,000 మంజూరు అవుతుండగా, ఇప్పుడు ఉపాధిహామీ మరియు స్వచ్ఛ భారత్ నిధులు కూడా చేరడంతో లబ్ధిదారులకు మరింత ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఈ నిర్ణయం పేదలకు సొంత ఇల్లు కల్పించడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకరంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :