हिन्दी | Epaper
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Telugu News: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం

Sushmitha
Telugu News: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం

హైదరాబాద్ (కొంపల్లి):(Kompally) చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కట్టిన అమాయకులను మోసం చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పరిధిలోని మయూరినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అలీ, అతని అకౌంటెంట్ మహేశ్ చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారు. నిజాంపేటలో రేష్మా క్లినిక్ పేరుతో గత 20 సంవత్సరాలుగా దవాఖానా నడుపుతున్న అలీ, సైడ్ బిజినెస్‌గా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా ఈ చిట్టీల విలువ రూ.50 లక్షలు, రూ.30 లక్షలు, రూ.20 లక్షల వరకు చేరింది. సుమారు 150 మంది కస్టమర్లు ఇతని వద్ద చిట్టీలు వేశారు.

Read also: Krishna Chaitanya: పంచారామాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్

Kompally
Kompally

బాధితుల ఆందోళన, నిందితుల పరార్

గత రెండేళ్లుగా చిట్టీలు(Chitties) ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో కస్టమర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ఆర్ఎంపీ వైద్యుడు అలీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8న క్లినిక్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిబ్బంది, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స చేయించారు. అనంతరం కోలుకున్న అలీ ఈ నెల 14 నుంచి మళ్లీ క్లినిక్‌కు వస్తుండటంతో బాధితులు చిట్టీల డబ్బుల కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో చిట్టీల నిర్వాహకుడు అలీ, అతని అకౌంటెంట్ మహేశ్ మధ్య వివాదం నడుస్తోంది. మహేశ్ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు.

పరస్పర ఫిర్యాదులు, పోలీసులు దర్యాప్తు

గురువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో బాధితులు రేష్మా క్లినిక్ వద్దకు చేరుకుని అలీని నిలదీశారు. దీంతో తనను అకౌంటెంట్ మహేశ్ మోసగించాడని అలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధితులు మాత్రం అలీ తమను మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులు మాట్లాడుతూ, “మా అమ్మ ఇల్లు అమ్మేసి చిట్టీలు వేసింది, మాకు రూ.11 లక్షలు రావాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు నష్టపోయిన మొత్తంపై పోలీసులు ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం)కు అప్పగిస్తామని తెలిపారు. మహేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టీల మోసం ఎక్కడ జరిగింది?

హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలోని మయూరినగర్, నిజాంపేట ప్రాంతాల్లో జరిగింది.

చిట్టీల వ్యాపారం నిర్వహించిన వ్యక్తి ఎవరు?

రేష్మా క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ వైద్యుడు అలీ.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

హైదరాబాద్ అలర్ట్, అగ్ని ప్రమాదాలపై హైడ్రా ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు !

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

భారీగా పతనమైన పసిడి ధరలు.. ఒక్కరోజే రూ. 13,000 డౌన్!

భారీగా పతనమైన పసిడి ధరలు.. ఒక్కరోజే రూ. 13,000 డౌన్!

హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు

హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870