Diwali: తెలంగాణ సింగరేణి కార్మికులకు పండుగల సీజన్లో డబుల్ హ్యాపీ న్యూస్ అందింది. ఇటీవల దసరా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ బోనస్ ఆనందం చల్లారకముందే, ఇప్పుడు కేంద్రం నుంచి మరో శుభవార్త వచ్చింది. కోల్ ఇండియా ప్రకటించిన పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు (PLR) కింద ప్రతి సింగరేణి (singareni) కార్మికుడి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమైంది. ఈసారి ఇచ్చిన పీఎల్ఆర్ బోనస్ చరిత్రలోనే అత్యధికం. గత ఏడాదితో పోలిస్తే రూ. 9,250 పెంచి ఈసారి బోనస్ మొత్తం రూ. 1.03 లక్షలుగా నిర్ణయించారు. 2010–11లో కేవలం రూ. 21,000గా ఉన్న ఈ బోనస్, దశాబ్దంలోనే ఐదు రెట్లు పెరిగింది.
Read also: TG Cabinet: 78 యంగ్ ఇండియా గురుకులాలు.. ఆమోదం తెలిపిన కేబినెట్

Diwali: Diwali bonus for Singareni workers
ఇక గత నెలలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంస్థ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు పంచగా, ఒక్కో శాశ్వత ఉద్యోగికి రూ. 1.95 లక్షలకు పైగా బోనస్ ఇచ్చింది. అలాగే తొలిసారిగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5,500 చొప్పున చెల్లించారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన దీపావళి (Diwali) బోనస్ కూడా చేరడంతో సింగరేణి ఉద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది.
సింగరేణి కార్మికులకు కేంద్రం ప్రకటించిన బోనస్ ఎంత?
ఒక్కో కార్మికుడికి రూ. 1.03 లక్షలు పీఎల్ఆర్ బోనస్గా జమైంది.
ఈ బోనస్ గతేడాదితో పోలిస్తే ఎంత ఎక్కువ?
రూ. 9,250 ఎక్కువగా ఈసారి చెల్లించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: