ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (jagan mohan reddy) ఆస్తుల వివాదంపై చెన్నై జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాజా ఆదేశాలు జారీ చేసింది. జగన్, ఆయన భార్య వై. భారతి, YS Bharathi తల్లి వై. విజయమ్మల పేర్లలో నమోదైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల వ్యవహారంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై ఎన్సీఎల్ఏటీ (NCLT) బెంచ్, ప్రస్తుతం ఉన్న షేర్ హోల్డింగ్ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వైఎస్ విజయమ్మకు ఉన్న 99.75 శాతం వాటా అలాగే కొనసాగాలని స్పష్టం చేసింది. షేర్ల బదిలీ లేదా వాటాల మార్పు వంటి చర్యలకు పాల్పడరాదని ఇరు పక్షాలకు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ తరఫు న్యాయవాది, “ఎన్సీఎల్టీ ఆదేశాల అమలుపై ఎటువంటి ధిక్కరణ చర్యలు చేపట్టమని” ఇచ్చిన హామీని ట్రైబ్యునల్ రికార్డులో చేర్చింది.
Wetlands: భారీ ప్రాజెక్టులను ప్రకటించిన పవన్ కల్యాణ్

YS Bharathi
హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పుపై సవాల్
ఇటీవల హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ జగన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. YS Bharathi ఆ తీర్పులో, కంపెనీ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని పేర్కొని, జగన్, భారతి, విజయమ్మలకు షేర్హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ, వైఎస్ విజయమ్మ వేర్వేరుగా సవాలు చేస్తూ చెన్నై ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. విచారణ అనంతరం చెన్నై ఎన్సీఎల్ఏటీ, “ఇరుపక్షాలు తదుపరి విచారణ వరకు తమ షేర్హోల్డర్ హక్కులను వినియోగించకూడదు” అని స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశాల ఫలితంగా, ప్రస్తుతం జగన్ కుటుంబానికి లభించిన హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
జగన్ కుటుంబానికి ఈ ఉత్తర్వుల ప్రభావం ఏంటి?
ఈ ఉత్తర్వుల వల్ల జగన్, భారతి, విజయమ్మలకు తాత్కాలికంగా షేర్ హోల్డర్ హక్కులు నిలిపివేయబడ్డాయి.
ఈ కేసు ఎక్కడ ప్రారంభమైంది?
హైదరాబాద్ ఎన్సీఎల్టీ లో ఈ కేసు ప్రారంభమై, తర్వాత చెన్నై ఎన్సీఎల్ఏటీకి వెళ్ళింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: