हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Telugu News: Modi: విశాఖలో గూగుల్ అతిపెద్ద పెట్టుబడి:మోదీ ఎమన్నారంటే

Sushmitha
Telugu News: Modi: విశాఖలో గూగుల్ అతిపెద్ద పెట్టుబడి:మోదీ ఎమన్నారంటే

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్(Google) తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (ఏఐ) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ‘వికసిత భారత్’ నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు. “చైతన్యవంతమైన నగరం విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉంది” అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.

Read Also:  Arogyashri : ఆరోగ్యశ్రీ సేవలకు అనారోగ్యం!

 Modi

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం

గిగావాట్-స్థాయి డేటా సెంటర్ మౌలిక సదుపాయాలతో కూడిన ఈ భారీ పెట్టుబడి, సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో శక్తివంతమైన చోదకశక్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇది ‘అందరికీ ఏఐ’ని అందిస్తుందని, పౌరులకు అత్యాధునిక సాధనాలను అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. తద్వారా మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై, ప్రపంచ టెక్నాలజీ లీడర్‌గా భారత్ స్థానం సుస్థిరమవుతుందని ఆయన అన్నారు.

గూగుల్ పెట్టుబడి, ప్రణాళికలు

ప్రధాని మోదీతో(Prime Minister Modi) మాట్లాడటం గొప్ప అనుభూతినిచ్చిందని సుందర్ పిచాయ్ తెలిపారు. “విశాఖపట్నంలో గూగుల్ మొట్టమొదటి ఏఐ హబ్ ఏర్పాటు ప్రణాళికలను ఆయనతో పంచుకున్నాం. ఇది ఒక చరిత్రాత్మక అభివృద్ధి” అని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030) సుమారు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. భారత్‌లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఈ హబ్‌లో గిగావాట్-స్థాయి కంప్యూట్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయని పిచాయ్ వివరించారు.

ఏఐ ఆవిష్కరణల వేగవంతం

అదానీకానెక్స్, ఎయిర్‌టెల్ వంటి ప్రముఖ భాగస్వాములతో కలిసి గూగుల్ ఈ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించనుంది. తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలకు, వినియోగదారులకు అందించి, దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేస్తామని పిచాయ్ తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ ఏఐ హబ్, భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక మైలురాయి లాంటిదని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.

గూగుల్ ఏ టెక్నాలజీ హబ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది.

గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టనుంది?

రాబోయే ఐదేళ్లలో (2026-2030) సుమారు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు పన్ను

ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు పన్ను

📢 For Advertisement Booking: 98481 12870