టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మైదానంలో అడుగుపెట్టగానే రికార్డులు బద్దలు కొట్టే సామర్థ్యం చూపిస్తారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 (Women’s ODI Cricket World Cup) లో ప్రారంభంలో కొద్దిగా తడబడినా, ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో ఆమె బ్యాటింగ్ ప్రతిభను మళ్లీ ప్రదర్శించారు.
India vs Australia: టాస్ ఓడిన టీమిండియా
ఈ క్రమంలో మంధాన మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2025లో) 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. విశాఖపట్నం (Visakhapatnam) లో జరిగిన ఈ మ్యాచ్లో ఆమె తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది.
స్మృతిమంధాన (Smriti Mandhana) 54 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఈ మైలురాయిని చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం, మంధాన ఈ సంవత్సరంలో కేవలం 18 మ్యాచ్లలోనే 1031 పరుగులు సాధించడం విశేషం. పరుగుల స్థిరత్వం, వేగానికి ఇది నిదర్శనం. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన 66 బంతుల్లో 80 పరుగులు చేసి ఔట్ అయింది.

అత్యధిక పరుగులు చేసిన రికార్డు
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంతకుముందు ఆస్ట్రేలియా (Australia) కు చెందిన బి.జె. క్లార్క్ (B.J. Clark) పేరిట ఉండేది. ఆమె 1997లో 16 మ్యాచ్లలో 970 పరుగులు సాధించింది. స్మృతి మంధాన సుమారు మూడు దశాబ్దాల నాటి ఈ రికార్డును కేవలం 18 మ్యాచ్లలోనే బద్దలు కొట్టింది.
ఈ విధంగా, తన ఫామ్ మరియు పరుగుల దాహంతో స్మృతి మంధాన, 52 ఏళ్ల చరిత్రలో ఎవరూ సాధించని ఒక కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. ఇది భారత మహిళా క్రికెట్కు మాత్రమే కాకుండా, ప్రపంచ క్రికెట్కు కూడా ఒక గొప్ప మైలురాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: