AI ఆధారిత తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections AI Ban) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (EC) కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల ప్రచార సంస్థలు కృత్రిమ మేధస్సు (AI) లేదా సింథటిక్ మీడియాను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం కఠినంగా నిషేధించింది. ఇలాంటి చర్యలు మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది.
Read also: Vijay: ప్రత్యేక వేదిక పై భాదిత కుటుంబాలను కలవనున్న విజయ్

స్వేచ్ఛా, నిష్పాక్షిక ఎన్నికల లక్ష్యంతో నిబంధనలు
బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, కమిషన్ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరగాలనే ఉద్దేశంతో AI (Bihar Elections AI Ban)వినియోగంపై నియంత్రణలు విధించింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించే వీడియోలు, గ్రాఫిక్స్, లేదా సోషల్ మీడియా(Social Media) పోస్టులు నిజమైన సమాచారాన్ని మాత్రమే ప్రతిబింబించాలనీ, తప్పుడు AI వీడియోల ద్వారా ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయరాదని హెచ్చరించింది.
సోషల్ మీడియా కంటెంట్ కూడా నియమావళి పరిధిలో
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అభ్యర్థులు లేదా పార్టీలు పంచుకునే కంటెంట్ కూడా ఇప్పుడు ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే AI కంటెంట్ను పంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని EC హెచ్చరించింది.
ఎన్నికల కమిషన్ ఏ విషయంపై నిబంధనలు జారీ చేసింది?
AI ద్వారా తప్పుడు ప్రచారం, సింథటిక్ వీడియోలు ఉపయోగించడం నిషేధించింది.
ఈ మార్గదర్శకాలు ఎవరికి వర్తిస్తాయి?
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల ప్రచార సంస్థలకు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: