మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్న(Subbabba)ను విచారణ కోసం మచిలీపట్నం పోలీసు స్టేషన్కు పిలిచారు. ఈ సమయంలో పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతనితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్.పేట సీఐ ఏసుబాబు(CI Yesubabu)పై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

400 మందిపై కేసు నమోదు
వైసీపీ నేతలు పేర్ని నాని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల దగ్గర ఇటీవల నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా కూడా వినకుండా గొడవ పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. వెంటనే విచారణకు రావాలని ఆదేశించారు. కానీ ఎవరూ కూడా తాము చెప్పేవరకు విచారణకు వెళ్లవద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వెంటనే సుబ్బన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. డైరెక్ట్గా సీఐ దగ్గకు వెళ్లి బెదిరించారు. మిగతా వారు కూడా పోలీసులను తక్కువ చేసి మాట్లాడారు. ఇలా మాట్లాడకూడదని చెప్పినా సీఐ ఏసుబాసుపై రెచ్చిపోయారు. దీంతో పోలీసులు పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు.
పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే ఎవరు?
పెర్ని వెంకటరామయ్య, సాధారణంగా పెర్ని నాని అని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాజీ శాసనసభ సభ్యుడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: