1,266 మంది ఖాతాల్లో రూ.12.66 కోట్లు జమ వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ అధికారుల ఆదేశాలు
indiramma illu : హైదరాబాద్ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నిజంగా ఇది షాకింగ్ వార్తే అని చెప్పవచ్చు. వారి ఖాతాలో జమ అయిన రూ. లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తు న్నారు. (Indiramma illu) తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేసింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇళ్లు మంజూరు చేసింది. వీటిల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా..
ఇంటి నిర్మాణం ప్రకారం దశల వారీగా అధికారులు లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధికారులు కొందరు లబ్దిదారుల ఖాతాలో జమ చేసిన రూ. లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదా రుల ఖాతాల్లో పొరపాటున ఆదనరంగా రూ. లక్ష చొప్పున జమ అయ్యాయని సమాచారం. ఈ విషయం కాస్త,, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారుల దృష్టికి రావడంతో.. వారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా ఖాతాలో రూ. లక్ష జమ అయిన లబ్దిదారులు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
Read also : ఆయుష్ బలోపేతం – కేంద్రం నుంచి రూ.166 కోట్లు మంజూరు

1,266 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 12.66 కోట్లకు పైగా అదనంగా జమ
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,266 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 12.66 కోట్లకు పైగా అదనంగా జమ అయినట్లు తెలు స్తోంది. దసరా పండగకు ముందు ఇళ్ల నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు జమ చేసే క్రమంలో ఈ పొరపాటు జరిగిందని అధికారులు అభిప్రాయ పడుతు న్నారు. సాంకేతిక సమస్య వల్లనే పలువురు లబ్దిదారుల ఖాతాలో అదనంగా డబ్బులు జమ ఆయ్యా యని.. ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొద లైందని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు.
ఆద నపునగదు జమ గురించి వెంటనే జిల్లాలవారీగా గృహ నిర్మాణశాఖ పీడీలకు సమాచారం అందింది. దీంతో ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి.. లబ్దిదారుల ఖాతాలో ఆదనంగా జమ అయిన రూ. లక్షను తిరిగి వచ్చేలా చూడాలని గృహనిర్మాణశాఖ జీఎం (ఫైనాన్స్) విభాగం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, ఆదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ రాసినట్లు సమాచారం.
అత్య ధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 మంది ఉన్నారని తెలుస్తోంది.
ఇలా ఆదనం గా రూ. లక్ష జమ అయిన లబ్దిదారుల్లో.. అత్య ధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 157 మంది ఉన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 119 మంది.. నిజామాబాద్ జిల్లాలో 91 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఆదనంగా డబ్బులు జమ అయ్యాయి. కొందరి నుంచి ఇప్పటికే ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టినట్లు సమాచారం.
పలువురి లబ్దిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున అద నంగా జమ అయిన మాట నిజమేనని… అయితే సాంకే తిక సమస్యవల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. ఆద నంగా జమ అయిన మొత్తాన్ని రికవరీ చేస్తున్నామని గృహనిర్మాణశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :