ఇవాళ తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన 52వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రంగంలో అత్యున్నత స్థానం సంపాదించిన ఆయనకు అభిమానులు,
Kishkindhapuri: ఓటీటీ, టీవీ ల్లోకి కిష్కింధపురి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సోషల్ మీడియాలో తన అభినందనలు
సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా (Social media) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని, స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా సోషల్ మీడియాలో తన అభినందనలు తెలిపారు.
రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఓ ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. “ఒకే ఒక్కడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను.
సోషల్ మీడియాలో వైరల్
అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి సర్” అంటూ మహేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో SSMB29 అనే వర్కింగ్ టైటిల్తో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మహేశ్ చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సందర్భంలో చిత్రబృందం అభిమానులకు ఓ తీపి కబురు అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా
ఈ అప్డేట్తో మహేశ్, రాజమౌళి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: