బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఆయనపై చోటుచేసుకున్న దాడి ఘటనపై తాజాగా స్పందిస్తూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. “నా మీద జరిగిన దాడిని కొందరు నాటకంగా ప్రచారం చేయడం నాకు చాలా బాధ కలిగించింది. నాకూ నా కుటుంబానికీ ఇది తీవ్రమైన మానసిక క్షోభ కలిగించింది” అని సైఫ్ అన్నారు.
Bigg Boss 9: వరుస ఇంటర్వ్యూలతో హరిత హరీష్
కొన్నిసార్లు వాస్తవాలను కూడా జనం నమ్మరని, మనం అలాంటి సమాజంలో జీవిస్తున్నామని అన్నారు.ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సైఫ్ (Saif Ali Khan) ఈ విషయంపై మాట్లాడుతూ, “ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు నేను నడుచుకుంటూ బయటకు వచ్చాను. అంబులెన్స్ లేదా వీల్చైర్లో కనిపిస్తే నాకేదో తీవ్రమైన గాయాలయ్యాయని అభిమానులు కంగారుపడతారని భావించాను.
నేను బాగానే ఉన్నానని వారికి భరోసా ఇవ్వడానికే అలా చేశాను. కానీ, కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు దాడే జరగలేదని, ఇదంతా కేవలం ఒక నాటకమని ప్రచారం చేశారు. కానీ నా గాయాలు, నా పరిస్థితి పూర్తిగా నిజం” అని వివరించారు.

సైఫ్పై ఓ దుండగుడు దాడి చేసిన విషయం
ఈ ఏడాది జనవరి 16న సైఫ్పై ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు (Mumbai Police)… బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం రూ.30 వేల కోసమే అతను ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
వారం రోజుల చికిత్స అనంతరం సైఫ్ కోలుకున్నారు. ఈ ఘటన తన జీవితంలో ఒక తీవ్రమైన అనుభవమని, మీడియా, అభిమానుల స్పందన కూడా తనకు ఒక పాఠం నేర్పిందని సైఫ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: