వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ Jagan స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసావిశాఖపట్నం పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. గాజువాక Gajuwaka సమీపంలోని నగరంలో జరిగిన ఈ సమావేశంలో కార్మికులు తమ సమస్యలు, ఆందోళనలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. కార్మికుల సమస్యలు శ్రద్ధగా విన్న జగన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను గట్టిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. “ప్రైవేటీకరణ కంటే ప్రజల హక్కులు ముఖ్యం. మీరు నిశ్చింతగా ఉండండి — మీ కోసం నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని జగన్ హామీ ఇచ్చారు.
AP banks: 4 బ్యాంకులు విలీనం తో సేవలు బంద్

Jagan: We will fight in support of Visakhapatnam Steel Plant workers
వైఎస్సార్
ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ శ్రేణులు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి మాధవరావుపాలెం వరకు ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ Steel Plant పోరాట కమిటీ ప్రతినిధులు కూడా జగన్కు వినతిపత్రం అందజేశారు. Jagan గతంలో అసెంబ్లీలో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ congress తీర్మానం ఆమోదించిందని, తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన పునరుద్ఘాటించారు.
జగన్ వ్యాఖ్యలతో కార్మికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: