సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా, సినీ వర్గాల్లో “వారణాసి” (Varanasi) అనే టైటిల్ను ఖరారు చేశారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నవంబర్ 16న ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. రాజమౌళి సినిమా కాబట్టి దాని కథ, కాన్సెప్ట్, విజువల్ ప్రెజెంటేషన్ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.
Deepika Padukone : మరో వివాదంలో దీపికా పదుకొణె
ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని టాక్. ఆయనను ఒక యాక్షన్-అడ్వెంచర్ పాత్రలో చూపించనున్నారని, కథలో ఆధ్యాత్మికత, మిస్టరీ, థ్రిల్ అంశాలు మిళితమై ఉంటాయని తెలుస్తోంది. రాజమౌళి తన గత సినిమాల్లాగే ఈ మూవీని కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా మాత్రమే కాకుండా, పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చిత్రీకరణలో భాగంగా భారత్తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో కూడా షూటింగ్ జరగనుందని సమాచారం.

ఇక నటీనటుల విషయానికి వస్తే, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి–మహేశ్ కాంబినేషన్పై అభిమానులు, సినీ ప్రేమికులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంతర్జాతీయంగా కూడా దృష్టి సారించారు. “వారణాసి” అనే టైటిల్ నిజమైతే, ఆ నగరపు పురాణాత్మక, సాంస్కృతిక వైభవం ఈ సినిమాకు ప్రధాన బలం కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/