బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి సోషల్ మీడియా వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె భర్త రణ్వీర్ సింగ్తో కలిసి నటించిన అబుదాబీ టూరిజం ప్రమోషనల్ యాడ్లో దీపికా హిజాబ్ను పోలిన అబాయా ధరించి కనిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో ఆమె సంప్రదాయ ముస్లిం దుస్తుల్లో, మసీదు పరిసర ప్రాంతాల్లో కనిపించడంతో కొంతమంది నెటిజన్లు దీన్ని “మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసే” ప్రయత్నంగా పేర్కొన్నారు. “డబ్బుల కోసం విదేశీ మతాల ప్రాచారం చేస్తున్నారా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
Latest News: Netflix: నెట్ఫ్లిక్స్కి నోటిసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
అయితే మరోవైపు దీపికాకు మద్దతుగా పలువురు అభిమానులు, ఫ్యాషన్ విశ్లేషకులు నిలుస్తున్నారు. వారు చెబుతున్నదేమిటంటే — దీపికా ధరించినది హిజాబ్ కాదు, అది ‘అబాయా’. అబాయా అనేది మధ్యప్రాచ్య దేశాలలో సాంస్కృతికంగా అనుసరించే వస్త్రం, ఏ మతానికి చెందిన మహిళైనా మసీదుల్లో ప్రవేశించే సమయంలో గౌరవ సూచకంగా ధరిస్తారని పేర్కొన్నారు. “దీనిని మతప్రచారం అని భావించడం తప్పు. ఆమె అక్కడి సంస్కృతికి గౌరవం చూపింది అంతే” అని వ్యాఖ్యానిస్తున్నారు.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి యాడ్లు అంతర్జాతీయ టూరిజం ప్రమోషన్లో భాగమని, నటీనటులు స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులు ధరించడం సాధారణమని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు విభిన్నంగా రావడం వల్ల దీపికా ఈ యాడ్ వల్ల అప్రత్యక్షంగా మరింత చర్చకు గురయ్యారు. గతంలో కూడా ఆమె రాజకీయ వ్యాఖ్యలు, ఫ్యాషన్ ఎంపికలు వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా “దీపికా మతానికి గౌరవం చూపిందా లేదా ప్రచారం చేసిందా?” అనే అంశంపై నెటిజన్లు విభజించబడ్డారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/