ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోల(EVMs Color Photso)ను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలు ఈవీఎం(EVMs Color Photso) మెషీన్లపై ఉంటాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా జరిగే అనేక కొత్త మార్పులను సీఈసీ ఇవాళ వెల్లడించారు. ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి గురించి అప్డేట్ ఉంటుందన్నారు.

ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ యాప్లో ఓటింగ్ డేటా అప్డేట్ అవుతుందని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను కొత్తగా ఇవ్వనున్నామని, ఆ స్లిప్స్పై ఓటరు ఐడీ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా 1200 ఓటర్లు మాత్రమే పోలింగ్ చేసే రీతిలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఇ.వి.ఎమ్ అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) దేశవ్యాప్తంగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణల ప్రవేశపెట్టింది. ఈవీఎం, వివి ప్యాట్, నోటా లాంటి కొత్త విధానాలతో ఓటర్లకు భరోసాను ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) ను నిర్వచిస్తే ” పోలింగ్ జరిగే ప్రదేశాలలో ఉపయోగించే యాంత్రికంగా ఓట్లను నమోదు చేయడానికి, లెక్కించే యాంత్రిక పరికరం (ఉపకరణం) గా చెప్పవచ్చును.
ఇ.వి.ఎమ్ చరిత్ర?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ను నిర్వచనంలో పేర్కొన్నట్లుగా ఓట్లను నమోదు ( రికార్డ్ ) చేయడానికి మానవ సహాయంతో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి, భారతదేశంలో మొదటిసారి 1982 సంవత్సరంలో కేరళ రాష్ట్రం లోని నెం.70 పర్వూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉపయోగించబడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper :https://epaper.vaartha.com/
Read Also: