మహబూబ్ నగర్ : ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద(Flood) నమోదవుతున్నది. పాలమూరు వరప్రదాయిని జూరాల 13గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తు న్నాయి. జలాశయానికి 1,29,000ఇన్లో నమో దు కాగా, 6గేట్లు ఎత్తి దిగువకు 41,742 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌజ్కు 40476 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జూరాలలో 4.824 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
Read Also: NREGA: ఉపాధి హామీ పథకానికి టెక్నాలజీ పేరుతో నియంత్రణ!

జూరాల ఎడమ కాలువకు 550, క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా అవుట్ 82,813
క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. 883 అడుగులకు చేరిన శ్రీశైలం ద్యాం నిండుకుండను తలపిస్తున్నది. గత వారం రోజులుగా వరద ఉధృతి(Flood surge) కారణంగా గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో పర్యాటకుల సందడి నెలకొన్నది. వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం గేట్లు మూసివేశారు.
డ్యాం నీటిమట్టం 885 అడుగులకు గాను 884.20 లి అడుగులకు చేరింది.
డ్యాం సామర్థ్యం 215.8070 టీఎంసీలకు సా 210.9946 టీఎంసీలకు చేరింది. జలాశయానికి (= జూరాల పవర్ హౌజ్ నుంచి 37982, సుంకేసుల తె నుంచి 13,333 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం జలాశయంలోని ఎడమ, కుడి ము విద్యుదుత్పత్తి కేంద్రాలకు 61,853 క్యూసెక్కులు, గేట్ల ద్వారా 192990క్యూసెక్కులు విడుదల సీ॥ చేశారు. డ్యాంకు 1,45,300 క్యూసెక్కుల ఇన్లో నమోదు కాగా, 94,722 క్యూసెక్కులు అవుట్లోకె నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: