పాకిస్తాన్ (Pak) ఇటీవల తన దేశంలో భూఖనిజాలను తవ్వేందుకు అమెరికన్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలను అన్వేషించడానికి, తవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయినందున, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం దాని ప్రాధాన్య లక్ష్యంగా మారింది. ఈ క్రమంలోనే ఖనిజాల రవాణా, ఎగుమతులను సులభతరం చేయడానికి పాకిస్తాన్ కొత్త చర్యలకు తెరతీస్తోంది.
Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?
తాజాగా వచ్చిన సమాచార ప్రకారం.. గ్వాదర్ జిల్లా పాస్నిలో ఒక పెద్ద పోర్టును నిర్మించి నడపడానికి అమెరికన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది. ఈ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సలహాదారులు ఇప్పటికే వైట్ హౌజ్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించడమంటే చైనాతో ఉన్న సంబంధాల మధ్య కొత్త సమీకరణలను సూచిస్తుంది. గ్వాదర్ సముద్రతీరంలో చైనా ఇప్పటికే వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మౌలిక వసతులు నిర్మిస్తోంది.

ఈ పోర్టు నిర్మాణం ద్వారా పాకిస్తాన్ ఖనిజాల రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో అమెరికాకు కూడా ఈ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంటుంది. బలూచిస్థాన్లో భద్రతా సమస్యలు, చైనా–అమెరికా పోటీ మధ్య ఈ ఒప్పందం ఎంతవరకు సాకారమవుతుందనేది చూడాలి. పాక్ ఆర్థిక అవసరాలు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కలిసొచ్చిన ఈ ఒప్పందం రాబోయే రోజుల్లో ఇండో–పాక్, చైనా–పాక్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.