కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా, దర్శకత్వంలో రూపొందించిన కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) మూవీ 2025లో ప్రేక్షకులను మెప్పించిన సెన్సేషనల్ విజయం సాధించింది. విజయదశమి రోజున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం ద్వారా, ప్రేక్షకుల నుంచి ప్రాచుర్యం పొందింది.
Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్మెంట్: అభిమానులకు షాక్
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది.ఇక బుక్ మై షోలో రిలీజ్ రోజు సుమారు 1.28 మిలియన్కి పైగా టిక్కెట్లు (Tickets) బుక్ అయ్యయంటేనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతోంది.
భాషా వివాదంతో తెలుగు నాట ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చినా టాక్ బాగుండటంతో ఈ వివాదం పక్కకి వెళ్లిపోయింది. కంటెంట్ బాగుంటే వివాదాలు ఏం చేయలేవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.‘కాంతార చాప్టర్ 1’పై సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు (Celebrities) సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రంలో రిషబ్శెట్టి కొత్తలోకానికి తీసుకెళ్లాడని, హీరోగానే కాకుండా దర్శకుడిగానే నూటికి నూరు మార్కులు సంపాదించాడని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘కాంతార ఒక అద్భుతం. దేశంలోని అందరు చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి, అతడి టీమ్ని చూసి సిగ్గుపడాలి.
కంటెంట్తో పాటు వారి కృషి ఈ చిత్రాన్ని బ్లాక్బస్టర్గా నిలబెట్టింది. క్రియేటివ్ టీమ్ రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్ని అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను’ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: