తెలంగాణలో దసరా(Dasara) పండుగకు ముందు మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగకు నాలుగు రోజుల ముందే సుమారు రూ.800 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దసరా రోజే గాంధీ జయంతి కావడంతో ఆ రోజున మద్యం దుకాణాలు మూసివేయబడతాయని తెలిసి, మందుబాబులు ముందుగానే మద్యం దుకాణాలకు క్యూలు కట్టారు. దీంతో మద్యం షాపుల్లో కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.
Latest News: Dhruv Jurel:వెస్టిండీస్తో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలి సెంచరీ
సెప్టెంబర్ 28న ఒక్కరోజే రూ.200 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు (Liquor Sales) జరగగా, 29న రూ.278 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దసరా పండుగ వాతావరణం, అలాగే స్థానిక ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు సప్లైలు పెంచడమూ ఈ సేల్స్కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది దసరా సీజన్లో మద్యం కొనుగోళ్లు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ నెలలో మొత్తం రూ.3,046 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్రంలో మద్యం డిమాండ్ ఎంత పెరిగిందో సూచిస్తుంది. పండుగలు, ఎన్నికల వాతావరణం వంటి కారణాల వల్ల ఈ రకమైన భారీ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ గణాంకాలు మద్యం వ్యాపారం రాష్ట్ర ఆదాయానికి ఎంత పెద్ద భాగస్వామిగా మారిందో మరోసారి రుజువు చేస్తున్నాయి.