ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో పాకిస్థాన్ జట్టు నిరుత్సాహకర ప్రదర్శన చేసిన తర్వాత, మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఈ విషయంలో తీవ్రమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ఖాతా, మీడియా ఇంటర్వ్యూలలో అఫ్రిది పీసీబీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేదని నేరుగా విమర్శించారు.
Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ బాధ్యతల నుంచి మోహ్సీన్ నఖ్వీ (Mohsin Naqvi) తప్పుకోవాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు వైఫల్యం నేపథ్యంలో అఫ్రిది ఈ ప్రతిపాదన చేశాడు. పాకిస్థాన్ మంత్రిగా.. పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెట్పై ప్రత్యేక శ్రద్ద చూపే ఛైర్మన్ కావాలని అఫ్రిది నొక్కి చెప్పాడు.ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. భారత్తో ఆడిన మూడు మ్యాచ్లకు మూడింటిని పాకిస్థాన్ (Pakistan) ఓడిపోయింది. ఫైనల్లో పోటీ ఇచ్చినా తొలి రెండు మ్యాచ్ల్లో చిత్తయ్యింది.

పీసీబీ ఛైర్మన్గా నఖ్వీ న్యాయం చేయలేకపోతున్నాడని
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) ప్రెసిడెంట్గా కూడా నఖ్వీ వ్యవహరిస్తున్నాడు. కీలక పదవుల్లో ఉన్న నఖ్వీ పూర్తిగా సలహాదారుపై ఆధారపడుతున్నాడని అఫ్రిది ఆరోపించాడు.’పీసీబీ ఛైర్మన్, పాకిస్థాన్ మంత్రి అయిన మోహ్సిన్ నఖ్వీ సాబ్కు నా అభ్యర్థన, సలహా ఏంటంటే.. పీసీబీ ఛైర్మన్ బాధ్యతల నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి.
పీసీబీ అనేది పాకిస్థాన్ మంత్రిత్వ శాఖ కంటే పూర్తిగా భిన్నమైనది. కాబట్టి పీసీబీకి ఆయన దూరంగా ఉండాలి. పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket) కు ప్రత్యేక శ్రద్ద, సమయం కేటాయించే వ్యక్తి అవసరం. నఖ్వీ పూర్తిగా సలహాదారులపైనే ఆధారపడుతున్నారు.
ఈ సలహాదారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. క్రికెట్ గురించి తెలియదని ఆయనే స్వయంగా చెప్పారు. కాబట్టి ఆట గురించి తెలిసిన వ్యక్తులను పీసీబీ ఛైర్మన్గా, సలహాదారులుగా నియమించాలి.’అని అఫ్రిది విజ్ఞప్తి చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: