తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ (Department of Meteorology) తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులలో విస్తృత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) ప్రకటించడం జరిగింది.
AP Telangana : మరో నాలుగు రోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ
వర్షాలు కేవలం కొన్ని జిల్లాల వరకు మాత్రమే కాక, మొత్తం రాష్ట్రంలో సాధారణంగా గల స్థాయి పైగా ప్రభావం చూపవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.ప్రస్తుతం బంగాళాఖాతం (Bay of Bengal) లో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజాము నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఇదే దిశలో ప్రయాణించి, 3వ తేదీన దక్షిణ ఒడిశా – ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu states) పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
దీనికి తోడు రాగల మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: