हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Telugu News: SC,BC: జగన్ ది అంతా బూటకం: మంత్రి పార్థసారథి

Sushmitha
Telugu News: SC,BC: జగన్ ది అంతా బూటకం: మంత్రి పార్థసారథి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ'(B.C) అంటూనే వారికి తీవ్ర అన్యాయం చేశారని,”నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, జగన్ రెడ్డికి బలహీన వర్గాలపై ఉన్న ప్రేమ కూడా అంతే” నని ఆయన ఎద్దేవా చేశారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో కీలకమైన ప్రభుత్వ పదవులు, ఛైర్మన్ పోస్టులు, ముఖ్య సలహాదారుల నియామకాల్లో జగన్ తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, ఈ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

Read Also: Mahakali: అక్షయ్ కన్నా శుక్రాచార్యుడిగా ఫస్ట్ లుక్ రిలీజ్

బీసీ వ్యతిరేక విధానాలకు నిదర్శనం

ఒక బీసీ నాయకుడైన చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసే విషయంలో వైసీపీ అడ్డుపడటమే వారి బీసీ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పార్థసారథి విమర్శించారు. చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనను ఎందుకు అడ్డుకుంటున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో అనేక కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల వేలాది మంది బలహీన వర్గాల నేతలు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

SC,BC

కూటమి ప్రభుత్వం సంక్షేమం

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కట్టుబడి ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేశామని తెలిపారు. అదేవిధంగా, వివిధ వర్గాలకు అందిస్తున్న ఆర్థిక సహాయం, గౌరవ వేతనాలను గణనీయంగా పెంచామని వివరించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు హ్యాండ్లూమ్ పరిశ్రమకు విద్యుత్ రాయితీలు, ఏటా ఆర్థిక సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉద్యోగ భర్తీ, ఎన్నికల ఫలితాలు

యువతకు ఉపాధి కల్పనలో భాగంగా డీఎస్సీ ద్వారా 16,500 ఉపాధ్యాయ పోస్టులతో పాటు, పోలీస్, ఆరోగ్య శాఖల్లో వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని పార్థసారథి గుర్తుచేశారు. వైసీపీ పాలనలో బలహీన వర్గాలపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు గమనించారు కాబట్టే, 2019లో 151 సీట్లతో గెలిచిన ఆ పార్టీని 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు రక్షణగా నిలుస్తుందని, వారికి అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

వైసీపీపై మంత్రి పార్థసారథి చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

వైసీపీ పాలనలో కీలక పదవులను తమ సొంత సామాజిక వర్గానికే ఇచ్చి, బీసీ, ఎస్సీ, ఎస్టీలను వంచించారని ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ రిజర్వేషన్ కల్పించింది?

మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cinema/mahakali-akshay-kanna-as-shukracharya-first-look-released/557144/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870