టెక్ దిగ్గజం గూగుల్కు చెందిన యూట్యూబ్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సాగిన న్యాయపోరాటాన్ని ముగించింది. 2021లో ట్రంప్ ఖాతాను సస్పెండ్(Account suspended) చేసినందుకు ఆయన వేసిన కేసును 24.5 మిలియన్ డాలర్ల (దాదాపు ₹204 కోట్లు)తో సెటిల్ చేసుకోవడానికి గూగుల్ అంగీకరించింది. ఈ విషయమై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పత్రాలు దాఖలయ్యాయి.
Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్!

24.5 మిలియన్ డాలర్లకు ఒప్పందం – విరాళాలకూ పెద్ద భాగం
2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్పై దాడి జరిగిన తర్వాత, హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందన్న కారణంతో యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ న్యాయపోరాటం ప్రారంభించగా, తాజాగా గూగుల్తో ఒప్పందానికి వచ్చారు.
సెటిల్మెంట్లో(settlement) భాగంగా 22 మిలియన్ డాలర్లు Trust for the National Mall అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తాన్ని ఈ కేసులో పిటిషనర్లు అయిన అమెరికన్ కన్జర్వేటివ్ యూనియన్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు.
అయితే, ఈ రాజీతో గూగుల్ తనవైపు నుంచి ఎటువంటి తప్పును అంగీకరించలేదని స్పష్టంచేసింది. అక్టోబర్ 6న కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, వారం ముందు ఇరువైపులా పరిష్కారం కుదిరింది.
ఇది ట్రంప్ దాఖలు చేసిన కేసుల్లో టెక్ దిగ్గజాలు సెటిల్మెంట్కు వచ్చిన మూడోసారి. ఇంతకుముందు మెటా 25 మిలియన్ డాలర్లు, ఎక్స్ (మాజీ ట్విట్టర్) 10 మిలియన్ డాలర్లు చెల్లించి ఇలాంటి వివాదాలను ముగించాయి.
గూగుల్–ట్రంప్ మధ్య వివాదం ఎందుకు మొదలైంది?
2021లో యూఎస్ క్యాపిటల్ అల్లర్ల తర్వాత, యూట్యూబ్ ట్రంప్ ఖాతాను నిలిపివేయడంతో వివాదం మొదలైంది.
సెటిల్మెంట్ మొత్తం ఎంత?
ఇరు పక్షాలు 24.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹204 కోట్లు)కు రాజీ పడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: