ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్పై అద్భుత ఇన్నింగ్స్తో భారత్కు చిరస్మరణీయ విజయం అందించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma)కు స్వస్థలమైన హైదరాబాద్లో ఘన స్వాగతం (A warm welcome to Hyderabad) లభించింది. ఆసియా కప్లో తొమ్మిదోసారి భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.తిలక్ రాక కోసం విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అభిమానులు, క్రీడా శాఖ అధికారులు ఎదురుచూశారు. ఆయనను చూసిన వెంటనే “తిలక్.. తిలక్” అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహానికి స్పందించిన తిలక్, తన కారు సన్రూఫ్ ద్వారా బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలా దేవి శాలువాతో సత్కరించి తిలక్కు అభినందనలు తెలిపారు.
Trump’s ‘Peace Deal’ : ట్రంప్ ‘పీస్ డీల్’ను స్వాగతించిన 8 ముస్లిం దేశాలు

ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ అనుభవం
ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్ గురించి తిలక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను క్రీజులోకి అడుగుపెట్టగానే పలువురు పాక్ ఆటగాళ్లు మాటలతో రెచ్చగొట్టారని చెప్పాడు. వాళ్ల మాటలకు నేను బ్యాట్తోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు వాళ్లు మైదానంలో ఎక్కడా కనిపించడం లేదు” అని బీసీసీఐ.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివమ్ దూబేతో మాట్లాడుతూ తిలక్ చెప్పాడు.విమానాశ్రయంలో తిలక్ సోదరుడు తరుణ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్లో ఒత్తిడిని ఎదుర్కొని తిలక్ అద్భుతంగా ఆడాడు. మా కుటుంబం మొత్తం చాలా గర్వంగా ఉంది. అతని ప్రదర్శన మాకు అపారమైన సంతోషం ఇచ్చింది” అని అన్నారు.
ఫైనల్లో తిలక్ ఇన్నింగ్స్
మ్యాచ్ కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్, శివమ్ దూబేతో కలిసి 60 పరుగుల విలువైన భాగస్వామ్యం కట్టాడు. కేవలం 53 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆయన ఇన్నింగ్స్ భారత్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది.ఈ విజయంతో తిలక్ వర్మ కేవలం క్రికెట్ మైదానంలోనే కాకుండా అభిమానుల హృదయాల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. తన ప్రతిభ, ధైర్యం, ధోరణితో టీమ్ఇండియాకు విలువైన ఆటగాడిగా నిలుస్తున్న ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.