నీలిరంగు కళ్లతో మాయ చేసి అప్పట్లో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ మోహిని (Heroine Mohini) గుర్తుందా? అందం, అభినయంతో ఇండస్ట్రీని ఊపేసి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళ్లింది. గ్లామర్ బ్యూటీగా అప్పట్లో యూత్కి ఐకాన్గా నిలిచింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని అనుభవాలను పంచుకుంది.1987లో ‘కూట్టుప్పుంపులుక్కల్’ సినిమాతో మోహిని తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే 1991లో వచ్చిన ‘ఈరమాన రోజావే’తో పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి చేసిన ‘ఆదిత్య 369’ సినిమా ఆమెను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది.
Abhishek Sharma : అభిషేక్ శర్మకు భారీ గిఫ్ట్

అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుని, వెండితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత హిందీలో ‘డాన్సర్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. కొన్నేళ్లలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.2007లో ‘కుట్రపత్రికై’ అనే తమిళ సినిమాతో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. 21 ఏళ్ల వయసులో ఏంబీఏ గ్రాడ్యుయేట్ అయిన భరత్ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఇంటర్వ్యూలో వెల్లడించింది.
వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు
మోహినీ తెలిపిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద కష్టాలు లేకపోయినా, తరచుగా ఆత్మహత్యా ఆలోచనలు వచ్చేవని చెప్పుకొచ్చింది. నిద్రలో తనను ఎవరో చంపుతున్నట్లు కలలు రావడం ప్రారంభమైందని తెలిపింది.ఒకసారి జ్యోతిష్యుడిని కలిసినప్పుడు తనపై చేతబడి (Black magic) ఉందని అతను చెప్పాడని మోహినీ చెప్పింది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కూడా వెల్లడించింది. ఈ కామెంట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
మోహినీ కామెంట్లపై చర్చ
సినిమాల ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన మోహినీ చేసిన ఈ రివెలేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె జీవితంలోని ఈ కష్టాలు, అనుభవాలు విని అభిమానులు షాక్ అవుతున్నారు.
Read Also :