हिन्दी | Epaper

Telugu News: Savita: దుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి పథంలో రాష్ట్రం: మంత్రి సవిత

Sushmitha
Telugu News: Savita: దుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి పథంలో రాష్ట్రం: మంత్రి సవిత

విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్రం, విజయవాడ నగర ప్రజలపై దుర్గమ్మ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మవారికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేదాశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

Read Also: Vijay: నటుడు విజయ్ కి బాంబు బెదిరింపులు

Savita

ఉచిత దర్శనం, భక్తుల సౌకర్యాలు

మంత్రి సవిత(Savita) మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ముగిసేవరకు భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సుదూరం నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారని, అమ్మవారి దర్శనానికి స్త్రీ శక్తి పథకం ఎంతో దోహదం చేస్తోందని మంత్రి తెలిపారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి సవిత క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

వైద్య శిబిరాల పరిశీలన, ఆశీర్వచనం

కొండపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా మంత్రి సవిత పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి సవితకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఏడో రోజు ఆదివారం అమ్మవారు శ్రీమహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మంత్రి సవిత దుర్గమ్మకు ఎప్పుడు పట్టువస్త్రాలు సమర్పించారు?

దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఏ పథకం మహిళలు ఆలయానికి రావడానికి దోహదపడుతోందని మంత్రి అన్నారు?

ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ‘స్త్రీ శక్తి పథకం’ మహిళలు ఆలయానికి రావడానికి దోహదపడుతోందని మంత్రి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870