రాజంపేట : అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఏపీఈడీబీ) ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.40 గంటలకు ఆ దేశ రాజధాని సియోల్ వేరుకున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని నామీ ల్యాండ్ సీఈవో మిర్ క్యోంగ్ పూతో మంత్రి నారాయణ, సీఆఏ కమిషనర్ కర్ననాలు బేటీ అయ్యారు.
Read Also: RDT: మరో పొలికేకతో ఆందోళనకు ప్రజా సంఘాలు సన్నద్ధం

దక్షిణ కొరియాలో సహజ సిద్ధమైన సాంస్క ృతిక, సాంప్రదాయక పర్యాటక ప్రదేశంగా తిన్న నామీ బలాండ్ ప్రపంచ పర్యాటకులను(World tourists) విశేషంగా ఆకర్షిస్తున్నది. సియోల్లో ఉన్న అతి పెద్ద పర్యాటక ప్రాంతం ఇదే విశేషం. ఇక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత;వాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్థికంగానూ అభివృద్ధి సాధిస్తోంది. నామీ ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈవోతో మంత్రి నారాయణ దర్శించారు. 4,60,000వ.మీ. విస్తీర్ణంలో అందమైన చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీపంలో అనుసరిస్తున్న విధానాలను అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు.
మధ్యాహ్నం లంచ్ తర్వాత సియోల్లోని లియాంగ్ గేవెఒన్ వాగును మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. 30 ఏళ్ల క్రితం పూర్తిగా మురుగునీటిలో తీవ్ర కాలుష్య కారకంగా ఉండి తర్వాత అత్యంత పరిశుభ్రంగా మారిన చియాంగ్ వెఒక వాగును పరిశీలించారు. 2003-2005 మధ్యకాలంలో సీయోట్ నగరంలో మెరుగైన వాతావరణం. కల్పించడం కోసం “రియాంగ్ దెఒర్” పునరుద్ధరణ ప్రాజెక్టును స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సియోల్ నగర వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం చేసిన ప్రయత్నం ఫలించి నేడు అత్యంత ఆహ్లాదకరంగా వయాంగీగౌచెఒన్ వాగు వరినక ప్రాంతాలు మారాయి. ముఖ్యంగా గతంలో అత్యంత మురికిగా, కాలుష్య కారకంగా ఉండే “బియాంగ్ వెటర్” వాగులోని నీరు.. నేడు పునరుద్ధరణ తర్వాత ఎంతో స్వచ్చంగా మారడం, గాలి నాణ్యత పెరగడం, శబ్ద కాలుష్యం తగ్గడం.. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడటం ఈ వాగు పునరుద్ధరణలో ప్రత్యేకత.
ఏపీలో కాలుష్య కారకంగా మారిన నదులు, కాలువలు, వాగులు వంటి వాటిని పునరుద్ధరించే కోణంలో ఈ వాగును మంత్రులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాదికారులు ఎం.టీ.కృష్ణబాబు, కన్నబాబు పరిశీలించారు. సాయంత్రం దక్షిణ కొరియాలో హన్ నదిని మంత్రులు పరిశీలించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ను నగరం మధ్యలో ప్రవహించే హన్ నది.. నదీ పరిసర ప్రాంతాలను
మంత్రులు పరిశీలించారు. సియోల్ అభివృద్ధిలో అంతర్భాగంగా నిలుస్తూ, నగరవాసులకు ఆహ్లాదకర కల్పిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుండటం హన్ నది యొక్క ప్రత్యేకత. అమరావతి. నిర్మాణంలో సైతం ఇటువంటి అహ్లాదకర వాతావరణం కల్పించే కోణంలో హన్ నది తీర ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. హాన్ నది.
పరివాహక ప్రాంతంలో అనేక పార్యులు, వంతెనలు, సైకిల్ మార్గాలు వంటి అభివృద్ధి నిర్మాణాలతో(development structures) ఆధునిక రాజధానులకు సరికొత్త రూపంగా సియోల్ నిలుస్తుంది. కృష్ణానది తీరంలో అమరావతి రాజధాని నిర్మిస్తున్న క్రమంలో హన్ నది… తరహాలో ఆధునిక రాజధాని నిర్మాణంలో కృష్ణ తీరంలో అభివృద్దికి ఉన్న అవకాశాలపై మంత్రులు స్థానిక అధికారులతో చర్చించారు. రాత్రికి రక్త కొరియా రాజధాని సియోల్లో భారత రాయబా కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషికాంత్ సిం షాలిని సింగ్ దంపతుల ఆహ్వానం మేరకు స్థానిక కరమ భవన్లో మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెం ప్రభుత్వ ఉన్నతాధికారులు టి. కృష్ణబాబు, కాటనుడే భాస్కర్, కన్నబాబు తదితరులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: