ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రైతుల (Amaravati Farmers) సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, గత ప్రభుత్వ పద్ధతులే కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పేరుతో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.

సుజనా చౌదరి (Sujana Chowdhury) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సమస్యలపై చర్చించడానికి స్పీకర్కి 2 గంటల సమయం కేటాయించాలని కోరినా అది లభించలేదని తెలిపారు. అసెంబ్లీలో అధికార పక్షం ఈ అంశాన్ని అడ్రస్ చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను మూడు పేజీల లేఖ రాసి స్పీకర్కి పంపినట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రాజధాని సమస్యపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
News telugu: Heating Food- పదే పదే వేడి చేసిన ఆహారం తింటే కలిగే ప్రమాదాలు ఇవే
అదే సమయంలో గత ప్రభుత్వం పర్యావరణ పరంగా అనేక తప్పులు చేసిందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆ తప్పులను సరిదిద్దకుండా, కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందని ఆరోపించారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి దృఢమైన విధానాలు, పారదర్శకమైన చర్చలు అవసరమని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి విధానాలపై కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి.