హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో, అధికారులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్(Himayat Sagar) లోకి గణనీయంగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల గేట్లు ఎత్తి, నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం మూసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ వంటి ప్రాంతాల్లో నదిని ఉద్ధృతంగా ముంచేస్తోంది.

బ్రిడ్జిపై నీటి ప్రవాహం: ట్రాఫిక్ మళ్లింపు
ఉస్మాన్ సాగర్ (Usman Sagar)నుంచి విడుదల చేసిన నీటి ప్రభావంతో మూసారాంబాగ్ బ్రిడ్జి రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నారు.
నగరవాసులకి తీవ్ర ఇబ్బందులు
భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు, బయట పనులకెళ్లినవారు తడిసిముద్దయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: