మోదీ (Modi) ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ జాబితాలో మేకిన్ ఇండియా స్కీమ్ (Make in India Scheme) కూడా చేరింది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014లో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు 11 ఏళ్లు పూర్తిచేసుకుంది. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.2014లో ఘనంగా ప్రారంభమైన ఈ స్కీమ్కు భారీ అంచనాలు పెట్టారు. తయారీ రంగంలో 12-14 శాతం వృద్ధి, జీడీపీలో 25 శాతం వాటా, 10 కోట్ల ఉద్యోగాలు సృష్టి వంటి పెద్ద లక్ష్యాలు నిర్దేశించారు. కానీ గడిచిన 11 ఏళ్లలో ఇవి ఏదీ నెరవేరలేదు.2013-14 నుండి ఇప్పటివరకు తయారీ రంగంలో వృద్ధిరేటు 6 శాతం దాటలేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 16 శాతంలోనే ఆగిపోయింది. ఉద్యోగాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2011-12లో 12 శాతంగా ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు 10 శాతం కంటే తక్కువయ్యాయి. 2016-21 మధ్యలో ఉద్యోగాలు సగానికి తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మూతబడ్డ కంపెనీల భారం
గడిచిన 11 ఏళ్లలో సుమారు 7 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. దీని కారణంగా లక్షలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే 22 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు ఉన్న దేశంలో ఈ పరిణామం ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.దేశ ఆర్థిక బలానికి ఎగుమతులు ముఖ్యమైనవి. కానీ మోదీ పాలనలో అవి నేలచూశాయి. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎగుమతుల్లో 2.2 శాతం వాటా ఉండగా, ఇప్పుడు అది 1.6 శాతానికి పడిపోయింది. రూపాయి విలువ కూడా చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. విశ్లేషకుల ప్రకారం, స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహకాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
స్వదేశీ నినాదం ఎందుకు ఆలస్యంగా?
మోదీ ఇటీవల స్వదేశీ నినాదం ఎత్తుకున్నా, 11 ఏళ్లుగా మేకిన్ ఇండియాను గాలికొట్టేశారని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగ కల్పన, ఉత్పత్తి పెంపు, కంపెనీలకు చేయూత వంటి అంశాలలో ప్రభుత్వం విఫలమైందని నిపుణులు అంటున్నారు.బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు వస్త్ర ఎగుమతుల్లో ఏటా 6 శాతం వృద్ధి సాధిస్తున్నాయి. కానీ భారత్ వద్ద వృద్ధిరేటు 1 శాతం కూడా దాటడం లేదు. పాదరక్షల రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో 5 శాతం వృద్ధి ఉంటే, మన దగ్గర అది 1 శాతానికి తగ్గిపోయింది.
విదేశీ కంపెనీలకు గుడ్బై
2014 నుండి 2022 వరకు 3,552 విదేశీ కంపెనీలు భారత్కు వీడ్కోలు చెప్పాయి. పీఎస్యూలలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు, జీఎస్టీ భారాలు వంటి నిర్ణయాలు కూడా పరిశ్రమలకు దెబ్బ కొట్టాయి.మేకిన్ ఇండియా పేరుకే గ్లామర్ తెచ్చుకున్నా, క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు తేల్చారు. ఉద్యోగాలు తగ్గడం, ఎగుమతులు పడిపోవడం, కంపెనీలు మూతపడటం ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also :