हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News: Crime: ఆస్తి కోసం ఇంత దారుణమా?: స్నేహితుడిని చంపించిన బంధువు.

Sushmitha
Telugu News: Crime: ఆస్తి కోసం ఇంత దారుణమా?: స్నేహితుడిని చంపించిన బంధువు.

నమ్మిన ప్రాణ స్నేహితుడు నట్టేట ముంచడం, కన్న బంధువులే హత్యకు పాల్పడటం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనే చెబుతోంది. పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో కేవలం ఆస్తి వివాదం కోసం ప్రాణ స్నేహితుడు, బంధువు కలిసి ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతుడు పద్మనాభరెడ్డి ఎద్దుల పోటీలకు ఎద్దులను తరలించే బండ్లకు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు.

హత్యకు దారితీసిన ఆస్తి వివాదం

పద్మనాభరెడ్డికి(Padmanabha Reddy) గ్రామంలో 14 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అతని చిన్నాన రాజశేఖర్ రెడ్డి ఆ స్థలాన్ని తనకు అమ్మమని కోరాడు. అయితే, కుటుంబ తగాదాల కారణంగా పద్మనాభరెడ్డి అందుకు నిరాకరించాడు. తన బంధువుకు కాకుండా, అదే గ్రామానికి చెందిన గొల్ల రంగడికి ఆ స్థలాన్ని విక్రయించాడు. తనకు స్థలం అమ్మలేదన్న కోపంతో రాజశేఖర్ రెడ్డి పద్మనాభరెడ్డిపై పగ పెంచుకున్నాడు. తన బావమరిది రామ్ కొండను గ్రామానికి పిలిపించి పద్మనాభరెడ్డిపై దాడి చేయించాడు. ఆ తర్వాత, పద్మనాభరెడ్డి తనపై దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించడంతో, భయపడిన రాజశేఖర్ రెడ్డి అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

 Crime

స్నేహానికి ద్రోహం, హత్య, మృతదేహం మాయం

పద్మనాభరెడ్డిని చంపడానికి రాజశేఖర్ రెడ్డి ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. పద్మనాభరెడ్డికి చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితుడైన బోయ గంప అయ్యన్నను డబ్బులకు ఆశ చూపాడు. పద్మనాభరెడ్డిని చంపి ఇస్తే రూ.1.30 లక్షలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులకు ఆశపడ్డ అయ్యన్న స్నేహాన్ని మరిచి హత్యకు ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం, అయ్యన్న పద్మనాభరెడ్డిని పొలం దగ్గరికి వెళ్దామని నమ్మబలికి వెంట తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత అయ్యన్న తన బృందంతో (శ్రీరాముడు, సిద్ధరాముడు, రాజశేఖర్ రెడ్డి) కలిసి పద్మనాభరెడ్డిని చంపాడు. హత్య తర్వాత, పద్మనాభరెడ్డి మృతదేహాన్ని సంచిలో ఉంచి, దానికి రాయి కట్టి డోన్-ప్యాపిలి హైవే దగ్గర ఉన్న వెంగళంపల్లి చెరువులో(Vengalampalli pond) పడేశారు.

పోలీసుల దర్యాప్తు, అరెస్టులు

మూడు నెలల తర్వాత పద్మనాభరెడ్డిపై ఉన్న కేసుల విచారణ కోసం పోలీసులు అతని ఇంటికి వెళ్లగా, అతని భార్య శిరీష తన భర్త మూడు నెలలుగా ఇంటికి రాలేదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పత్తికొండ టౌన్ సీఐ జయన్న తెలిపారు.

ఈ హత్యకు కారణం ఏమిటి?

పద్మనాభరెడ్డికి ఉన్న 14 సెంట్ల భూమిని కొనుగోలు చేసే విషయంలో జరిగిన ఆస్తి వివాదం.

ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు?

పద్మనాభరెడ్డి చిన్నాన రాజశేఖర్ రెడ్డి, చిన్ననాటి స్నేహితుడు బోయ గంప అయ్యన్న.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

విద్యార్థుల ఆవేదన విని చలించిపోయిన పవన్ కల్యాణ్

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

చంద్రబాబు, జగన్ పై వైసీపీ షర్మిల వాక్యాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

గురువు ప్రాణాలు కాపాడిన శిష్యుడు.. అసలేం జరిగింది?

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు – పేద పిల్లలకు పెద్ద అవకాశం

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

📢 For Advertisement Booking: 98481 12870