విజయవాడ :’ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, (CM Chandrababu) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (TG CM Revanth Reddy) లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృతజ్ఞతలు తెలియచేశారు. సినిమా పరిశ్రమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణమని కొనియాడారు. ఇవాళ హైదరాబాద్లో నిర్వహించిన ‘ఓజీ కన్సర్ట్ కి అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించింది.
అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, డీజీపీ జితేందర్ కి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ కి లాల్ బహదూర్ ఈ స్టేడియం (Lal Bahadur Stadium) నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షం కురుస్తున్నా ఈ వేడుకలో ఎనలేని ఉత్సాహంతో అసంఖ్యాకంగా అభిమానులు పాల్గొన్నారు.

వారు చూపిస్తున్న అభిమానం, ఉత్సహం మరువలేనిది వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకున్న శ్రేయాస్ మీడియా సంస్థ (Shreyas Media Company) కు, బందోబస్తు చేపట్టిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు.
చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు, పోలీసు, రెవిన్యూశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్,వెబ్ మీడియా యాజమాన్యాలు (Web Media owners), ఫొటోగ్రావర్లు, వీడియోగ్రావర్లు, విలేకర్లకు కృతజ్ఞతలు.
‘ఓజీ’ చిత్ర రూపకల్పనలో ఎంతో తపించి పని చేసిన దర్శకుడు సుజిత్, నిర్మాతలు డివివి దానయ్య, మ్యూజిక్ దర్శకుడు తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు మనస్పూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: